Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పెరిగిన కరోనా కేసులు.. 120మందికి పాజిటివ్.. వ్యాక్సిన్ రికార్డ్

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (18:37 IST)
ఆంధ్రప్రదేశ్‌ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 48,973 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 120 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 
 
గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఒకరు మృతి చెందారు. అదే సమయంలో 93 మంది రికవరీ అయ్యారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,91,004 కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 8,82,763 కి చేరింది. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 7,177 మంది మృతిచెందారు. 
 
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ శరవేగంగా జరుగుతోంది. సోమవారం ఒక్కరోజే 20 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికమని తెలిపింది. ఈ నెల 8 నాటికి వ్యాక్సినేషన్ డ్రైవ్ కు 50 రోజులైందని.. ఆ రోజు 20,19,723 మందికి టీకా వేశామని చెప్పింది.
 
వీరిలో 17,15,380 మందికి ఫస్ట్ డోస్.. 3,04,343 మందికి సెకండ్ డోస్ ఇచ్చామని వివరించింది. ఫస్ట్ డోస్ తీసుకున్నోళ్లలో 60 ఏండ్లకు పైబడినోళ్లు 12,22,351 మంది, 45 ఏండ్లకు పైబడి కోమార్బిటీస్ ఉన్నోళ్లు 2,21,148 మంది ఉన్నారంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments