Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రానికి అన్యాయం జరిగిన రోజును మరిచిపోకూడదు.. అదో చీకటి రోజు: చంద్రబాబు

రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగిన జూన్ 2వ తేదీని ఎవరూ మరిచిపోకూడదని కాబట్టే.. తానిలా చేయాల్సి వచ్చిందని.. మండుతున్న ఎండల్లో సైతం నవ నిర్మాణ దీక్ష పేరిట తాను ప్రజలను కష్టపెట్టాల్సి వస్తోందని ఏపీ సీఎం చం

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2017 (11:00 IST)
రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగిన జూన్ 2వ తేదీని ఎవరూ మరిచిపోకూడదని కాబట్టే.. తానిలా చేయాల్సి వచ్చిందని.. మండుతున్న ఎండల్లో సైతం నవ నిర్మాణ దీక్ష పేరిట తాను ప్రజలను కష్టపెట్టాల్సి వస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం విజయవాడ బెంజ్ సర్కిల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. 
 
రాష్ట్ర నిర్మాణం కోసం పునరంకింతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రజల కష్టాన్ని తాను అర్థం చేసుకోగలుగుతానని చంద్రబాబు నాయుడు తెలిపారు. అన్యాయం జరిగిందని ఇళ్లలో పడుకుని సాధించేది ఏమీ లేదని, బయటకు వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత జపాన్ వాసులు చూపిన స్ఫూర్తి, ఆ దేశాన్ని అగ్రదేశాల్లో ఒకటిగా నిలిపిందని, అలాగే నవ్యాంధ్ర ప్రజలూ ముందడుగు వేయాలని కోరారు. రాష్ట్ర చరిత్రలో ఇదో చీకటి రోజని తెలిపారు. 
 
రాష్ట్రాలూ అవతరణ దినోత్సవాలను జరుపుకుంటాయని.. అదే సమయంలో మనం మాత్రం నవనిర్మాణ దీక్ష చేసి రాష్ట్రావతరణ సందర్భంగా జరిగిన రాష్ట్రాలూ అవతరణ దినోత్సవాలు జరుపుకుంటాయని బాబు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments