Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ ఆడుతూ గొడవ.. బ్యాట్‌తో కొట్టడంతో 9వ తరగతి విద్యార్థి మృతి

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (13:09 IST)
క్రికెట్ ఆడుతుండగా ఏర్పడిన గొడవతో తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని జి.కొత్తూరు గ్రామానికి చెందిన బాలుడు 7వ తరగతి.. నంగి సూర్య (14) 9వ తరగతి చదువుతున్నారు. 
 
సోమవారం సాయంత్రం క్రికెట్ ఆడుతున్న సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో సూర్య వెళ్తున్న సైకిల్‌ను మరో బాలుడు తన్నాడు.
 
దీంతో ఇద్దరు గొడవకు దిగగా.. అక్కడ ఉన్న యువకులు వారిని విడిపించారు. అనంతరం కింద పడిపోయిన సైకిల్‌ను సూర్య తీసుకుంటుండగా.. వెనుకనుంచి ఆ బాలుడు బ్యాట్‌తో తలపై కొట్టాడు. స్పృహ తప్పి కిందపడిపోయిన సూర్య.. కాసేపయ్యాక తేరుకున్నాడు. 
 
అలా ఇంటికెళ్లి నిద్రపోయాడు. తెల్లవారు జామున నిద్రపోతున్న సూర్యను లేపగా.. అతను లేవలేదు. గురక వస్తుండడంతో వెంటనే బిక్కవోలు ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
 
అయితే అప్పటికే ఆ సూర్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం పిల్లల మధ్య జరిగిన ఘర్షణ గురించి తెలుసుకున్న సూర్య తాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్రికెట్ ఆటలో జరిగిన ఘర్షణ అని.. వారి మధ్య ఎటువంటి పూర్వ తగాదాలు లేవని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments