Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రత్యేక హోదా అంశం ఉనికిలోనే లేదు : కేంద్రం స్పష్టీకరణ

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (08:52 IST)
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై కేంద్రం తన వైఖరిని మరోమారు కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది. ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం ఉనికిలోనే లేదని రాజ్యసభ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
 
రాజ్యసభలో వైకాపా ఎంపీ సుభాష్ చంద్రబోస్ విభజన చట్టం మేరకు ఏపీకి ప్రత్యేక హోదా సంగతి ఏమైందంటూ అడిగిన ప్రశ్నకు మంత్రి ఇంద్రజిత్ తనదైనశైలిలో సమాధానమిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమన్నారు.
 
వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితులు దృష్ట్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి (ఎన్.డి.సి) కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చిందన్నారు. 14వ ఆర్థిక సంఘం కేటగిరీ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ అంశంలో ఎలాంటి వ్యత్యాసం చూపలేదని, అందువల్ల ఏపీ ప్రత్యేకహోదా అంశం ఉనికిలోనే లేదని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments