Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూకబ్జాకు పాల్పడితే 14 యేళ్ల జైలుశిక్ష - ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఠాగూర్
గురువారం, 7 నవంబరు 2024 (10:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భూకబ్జాలకు పాల్పడే వారికి 14 యేళ్ల జైలుశిక్ష విధించేలా చట్టాన్ని తీసుకునిరానున్నారు. రాష్ట్రంలో ఇష్టానుసారం, ప్రభుత్వ పట్టా భూముల ఆక్రమలకు పాల్పడినవారికి తగిన గుణపాఠం చెప్పేలా అలాంటి కఠిన శిక్షలు విధించి, భారీ జరిమానాలతో చెక్ పెట్టేలా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోస ప్రస్తుతం ఉన్న భూఆక్రమణల నిరోధక చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లులు ప్రకారం ఇకపై భూఆక్రమణలకు పాల్పడేవారికి గరిష్టంగా 14 యేళ్ల వరకు శిక్ష విధించవచ్చు. అలాగే, ఏపీ డ్రోన్ పాలసీ , డేటా సెంటర్ల పాలసీ, సెమీ కండక్టర్ల పాలసీల అమలుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అదేవిధంగా రాజధాని ప్రాంత అభివృద్ధి  సంస్థ - సీఆర్డీఏ పరిధి పెంపునకు ఆమోదం తెలిపింది. 
 
ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఆక్రమించుకోవడం, ఎక్కడో దూరంగా ఉంటున్నవారి భూములను కబ్జా చేయడం, పేదల భూములు లాక్కోవడం, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు వంటివి నియంత్రించడం కోమే, ఏపీ భూఆక్రమణల నిరోధక చట్టం 1982ను రద్దు చేసి, దాని స్థానంలో ఏపీ భూఆక్రమణల నిరోధక చట్టం 2024 అమలుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పాత చట్టం పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులకే పరిమితమైంది. కానీ, కొత్త చట్టం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భూముల రక్షణకు వీలు కల్పించనుంది. అలాగే, ఆక్రమణదారులకు 10 నుంచి 14 యేళ్ల జైలుశిక్ష, భూమి విలువతోపాటు నష్టపరిహారం కలిపి జరిమానా విధిస్తారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి నిర్ణీత కాలంలో కేసుల పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments