Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు కోసం బీఏసీ సమావేశం ఆలస్యం చేశాం.. ఏపీ సీఎం జగన్

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (16:16 IST)
బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వస్తారని భావించామని, ఇందుకోసం సమావేశాన్ని సైతం ఆలస్యంగా ప్రారంభించామని కానీ ఆయన రాలేదని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఒక్క రోజు అసెంబ్లీ సమావేశాల కోసం ఏపీ అసెంబ్లీ గురువారం సమావేశమైంది. 
 
ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ప్రభావం చంద్రబాబుపై బాగా పడిందన్నారు. అందుకే బీఏసీ సమావేశానికి చంద్రబాబు హాజరుకాలేదని చెప్పారు. అయితే, చంద్రబాబుకు ఎలాంటి కష్టం వచ్చిందో నాకు తెలియదని, కానీ, కుప్పం ఎఫెక్టు మాత్రం బాగా పడిందని మావాళ్ళు అంటున్నారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. 
 
కాగా, ఈ సమావేశాల్లో సీఎం జగన్ మహిళా సాధికారికతపై ప్రసంగించారు. రాష్ట్రంలో మహళలు సర్వతోముఖాభివృద్ధిని ఓ ఉద్యమంలా భావించి అనేక పథకాలు అమలు చేస్తున్నామని సీఎం గుర్తుచేశారు. గడిచిపోయిన రెండున్నరేళ్ళ కాలం మహిళా సాధికారికత అంశం ఓ సువర్ణ అధ్యాయం అని ఆయన పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments