Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోన్‌ యాప్‌ల వ్యవహారం... కొడుకుని పోలీసులకు పట్టించిన తండ్రి!

Webdunia
శుక్రవారం, 1 జనవరి 2021 (09:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లోన్‌ యాప్‌ల కేసులో ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. తన కుమారుడు లక్షలాదిమందిని మోసం చేసినట్టు తెలుసుకున్న ఓ పోలీసు అధికారి అతడిని సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టించాడు. 
 
లోన్‌ యాప్‌ల కేసులో రెండు రోజుల క్రితం చైనా దేశీయుడు ల్యాంబో, కర్నూలు జిల్లా వాసి నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజు..  ల్యాంబో తరఫున ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో లోన్‌ యాప్‌ వ్యవహారాలను చూసుకునేవాడు. ఈ క్రమంలో నాగరాజు తన సోదరుడిని కూడా రుణ యాప్‌ల సంస్థలో చేర్పించాడు.
 
అయితే నాగరాజు తండ్రి కర్నూలు జిల్లాలో ఏఎస్‌గా పనిచేస్తున్నారు. కొన్ని రోజులుగా నాగరాజు వ్యవహారాన్ని గ్రహించారు. అతనిపై అనుమానంతో అసలు విషయాలు తెలుసుకోవడం ప్రారంభించారు. దీంతో నాగరాజును ఢిల్లీ నుంచి ఇంటికి రప్పించారు. 
 
అనంతరం హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేంతవరకు నాగరాజును ఇంట్లోనే ఉండేలా చేసి పోలీసులకు పట్టించారు. అయితే తన వివరాలు బహిర్గతం చేయకూడదని ఆ ఎస్‌ఎస్‌ఐ.. సైబర్‌క్రైం అధికారులను కోరారు. 
 
బంధం కంటే బాధ్యత గొప్పదని భావించి కన్న కుమారులనే పోలీసులకు పట్టించిన ఏఎస్సైపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా, తన కుమారుల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆయన తన పేరు, వివరాలను బయటపెట్టవద్దని సైబర్ క్రైం పోలీసులను కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments