Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనకాపల్లి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్సు రైలు... అనేక రైళ్లు రద్దు

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (18:43 IST)
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. బొగ్గు లోడుతో వెళుతున్న ఈ రైలు తాడి - అనకాపల్లి మార్గంలో పట్టాలు తప్పింది. మొత్తం ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. బుధవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన కారణంగా ట్రాక్ దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో నడిచే అనేక ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. 
 
రద్దు చేసిన రైళ్లలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్, విశాఖ నుంచి గుంటూరుకు వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌తో పాటు రత్నాచల్ - ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. అలాగే, గుంటూరు నుంచి విశాఖ వైపు వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను మాత్రం ఈ నెల 15వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. 
 
విశాఖ - సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ రైలును మాత్రం మూడు గంటలు ఆలస్యంగా నడిపిస్తున్నారు. మరోవైపు, రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులను చేపట్టి, త్వరితగతిన పూర్తి చేసేలా దృష్టిసారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments