Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 నెలలు... 32 అత్యాచారాలు... ప్రేమజంటలే లక్ష్యంగా...

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (09:09 IST)
ఏలూరులో ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని అత్యాచారాలు చేస్తున్న రేప్ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత 24 నెలల్లో 32 అత్యాచారాలు శారు. తమ దారికిరాని వారిని హత్య కూడా చేశారు. అలా మూడు హత్యలు చేశారు. 
 
ఇటీవల బౌద్దారామాల వద్ద ప్రేమ జంటపై దాడి, ఆపై యువతి హత్య కేసు రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. దీనిపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు..... అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి చివరకు నలుగురు హంతకులను అరెస్టు చేశారు. వీరిని జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. 
 
ఈ సందర్భంగా హంతకుల నేపథ్యాన్ని పోలీసులు వివరించారు. హంతకులు వృత్తిగా అడవి పందులు, జంతువులను, పక్షులను వేటాడేవారు. ప్రవృత్తిగా ప్రేమ జంటలే టార్గెట్‌. 24 నెలల్లో నాలుగు హత్యలు, 32 అత్యాచారాలకు తెగబడ్డారు. ఇప్పటికే మూడు హత్యలు, మూడు అత్యాచారాలపై కేసులు నమోదైనా ఈ నేరస్తులను సంబంధిత పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. 
 
జిల్లాలోని బౌద్దారామాల వద్ద జరిగిన ప్రేమజంటపై దాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి హంతకులను అరెస్టు చేయగలిగారు. వీరు చెప్పిన నేరాలను విన్న పోలీసులే అవాక్కయ్యారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments