Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్నాథ్ యాత్రలో విషాదం - ఏపీ భక్తురాలు మృతి

Webdunia
సోమవారం, 11 జులై 2022 (15:06 IST)
పవిత్ర అమర్నాథ్ యాత్రలో విషాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళా భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల ఆకస్మికంగా వర్షాలు కురవడంతో ఆ కారణంగా వరదలు వచ్చాయి. దీంతో అనేక మంది గల్లంతుకాగా, రాజమండ్రికి చెందిన ఇద్దరు మహిళలు కూడా ఉండగా, వీరిలో ఒకరైన గుణశెట్టి సుధ (48) చనిపోయినట్టు అధికారులు ధృవీకరించారు. 
 
గత రెండు రోజులుగా గాలింపు కొనసాగిస్తున్న నేపథ్యంలో సోమవారం శ్రీనగర్‌లోని ఆస్పత్రి మార్చురీలో సుధ మృతదేహాన్ని గుర్తించామని వారు వెల్లడించారు. మృతురాలు రాజమహేంద్రవరంలోని కుమారి టాకీస్‌ ప్రాంతానికి చెందినవారు. ఆమె మృతితో ఆ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. మరో మహిళ పార్వతి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, నెల్లూరు జిల్లా నుంచి 82 మంది అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారని కలెక్టర్‌ తెలిపారు. వీరిలో 57 మంది సురక్షితంగా ఉండగా.. మరో 25 మంది ఆచూకీ తెలియాల్సి వుందన్నారు. ఆచూకీ దొరకని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామన్నారు. నెల్లూరు జిల్లా యాత్రికుల కోసం 1902 టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments