Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల డైయిరీ ఫ్యాక్టరీలో అమ్మోనియం గ్యాస్ లీక్

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (11:50 IST)
చిత్తూరు జిల్లాలో గ్యాస్ లీక్ ప్రమాదం జరిగింది. ఈ జిల్లాలో ఉన్న హాట్సన్ పాల డెయిరీ యూనిట్‌లో గురువారం రాత్రి అమ్మోనియం గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 20 మందికి కార్మికులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరంతా అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 100 మందికిపైగా కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది.
 
సాధారణంగా ఫ్యాక్టరీకి వచ్చే పాలను కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచుతారు. ఇందుకోసం అమ్మోనియం వాయును ఉపయోగిస్తుంటారు. ఈ గ్యాస్ ప్రమాదవశాత్తు లీక్ కావడంతో ఈ ఘటన జరిగింది. అస్వస్థతకు గురైన కార్మికులను చిత్తూరు, గుడిపాల ఆసుపత్రులకు తరలించారు. 
 
అస్వస్థతకు గురైన వారిలో 14 మంది మహిళా కార్మికులు ఉన్నారు. ఈ ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ భరత్ గుప్తా డెయిరీని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments