Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ప్రసాదం లడ్డూలో మొన్న పిన్ను.. నేడు నల్ల కాళ్ళజెర్రీ...

Webdunia
మంగళవారం, 10 మే 2016 (10:11 IST)
తిరుమల శ్రీవారి లడ్డూల మరోసారి నిర్లక్ష్యం మరోసారి వెలుగుచూసింది. మొన్నటికి మొన్న శ్రీవారి లడ్డూలో పిన్ను కనిపించింది. ఓ లడ్డూలో పిన్ను ఉందంటూ ఓ భక్తుడు దాన్ని తిరిగిచ్చేశాడు. లడ్డూలో ఉన్న పిన్ను చూసి శ్రీవారి సేవకులు కూడా ఖంగుతిన్నారు. ఆ సంభవాన్ని మరువక ముందే మరో డొల్లతనం బయటపడింది. తిరుపతి లడ్డూలో జీడిపప్పులు, కిస్ మిస్, పటికబెల్లంతో పాటు ఇనుపముక్కలు, ప్లాస్టిక్ ముక్కలు వచ్చిన ఘటనలు చాలానే ఉన్నాయి. 
 
తాజాగా, తిరుపతి లడ్డూలో చనిపోయిన విషపూరిత నల్ల కాళ్ల జెర్రీ కనిపించింది. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని రామాపురం కాలనీకి చెందిన గొన్నాబత్తుల దేవీ ప్రసాద్, త్రినాథ్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అనంతరం లడ్డూలు కొనుగోలు చేశారు. తిరిగి ఆదివారం తమ గ్రామానికి చేరుకున్నారు. ప్రసాదాలు పంచేందుకు సోమవారం లడ్డూను ముక్కలు చేయగా జెర్రీ బయటపడడంతో భక్తులు ఖంగుతిన్నారు. ఈ సంఘటనపై తాము విస్మయం చెందామని, భక్తులు పవిత్రంగా భావించే ప్రసాదంలో ఇటువంటివి ఉండటం సరికాదని వారు మండిపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments