Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈఎస్ఐ స్కామ్ : అచ్చెన్నాయుడికి బెయిల్

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (14:21 IST)
తెలుగు రాష్ట్రాలను ఓ కుదుపుకుదిపిన ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టు అయిన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రి కె.అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరైంది. ఈ మేరకు ఏపీ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. 
 
ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టు అయిన అచ్చెన్నాయుడికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన ప్రస్తుతం మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని గతంలో కోర్టుకు దరఖాస్తు చేయగా న్యాయస్థానం తిరస్కరించింది. 
 
మరోసారి బెయిల్ మంజూరు చేయాలని అచ్చెన్న తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థి లోద్ర, హైకోర్టు సీనియర్ న్యాయవాది వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. 
 
ఈ వాదనలు మూడు రోజుల క్రితమే పూర్తయ్యాయి. కానీ తీర్పును రిజర్వులో ఉంచి శుక్రవారం వెలువరించింది. కొద్ది సేపటి క్రితమే హైకోర్టు అచ్చెన్నాయుడుకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 
 
రూ.2 లక్షలు షూరిటీ ఇవ్వాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లవద్దని, సాక్షులను తారుమారు చేయవద్దని, దర్యాప్తు అధికారికి అందుబాటులో ఉండాలని హైకోర్టు విధించిన షరతుల్లో పేర్కొంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments