Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెమాల్ తుఫాను ప్రభావం.. ఏపీలో మోస్తరుగా వర్షాలు

సెల్వి
శనివారం, 25 మే 2024 (20:07 IST)
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెమాల్ అనే తుపాను తీవ్రరూపం దాల్చిందని, కోస్తా మీదుగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌పై తుపాను ప్రభావం ఉండదని అధికారులు ప్రకటించారు. 
 
ఈ సాయంత్రానికి రెమాల్ తీవ్ర తుఫానుగా మారుతుందని, మే 26, ఆదివారం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా. ఈశాన్య రాష్ట్రాలకు వర్ష ప్రభావం వుంటుంది.
 
ఈ తుఫాను కారణంగా మధ్య బంగాళాఖాతంలో అలలు ఎగసిపడుతుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, చేపల వేటకు దూరంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. తుపాను వచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఓడరేవులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారి డాక్టర్ సునంద తెలిపారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభావితం కాకుండా ఉంటుందని భావిస్తున్నప్పటికీ, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రేపు, ఎల్లుండి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. మంగళవారం (మే 28) నుంచి ఏపీలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.
 
ఇంకా ఉత్తర ఒడిశా, బెంగాల్, మిజోరాం, త్రిపుర, మణిపూర్ వంటి ఇతర ప్రాంతాలకు హెచ్చరికలు రావడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇంకా, తుఫాను ప్రభావంతో నైరుతి రుతుపవనాలు వేగంగా పురోగమిస్తున్నాయని ఇది కాస్త శ్రీలంకకు చేరుకుందని వాతావరణ శాఖ సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

మైఖేల్ జాక్సన్‌కు కలిసిరానిది.. థ్రిల్లర్‌ ఇచ్చిన గిఫ్ట్

నిఖిల్.. స్వయంభు కొత్త షెడ్యూల్ మారేడుమిల్లిలో ప్రారంభం

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments