Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహం లండన్ వెళ్లింది, జూన్ 4న జూలు విదిలిస్తుంది: జగన్ పైన ఎమ్మెల్యే తోపుదుర్తి

ఐవీఆర్
శనివారం, 25 మే 2024 (18:59 IST)
సింహం లండన్ వెళ్లింది, జూన్ 4న జూలు విదిలిస్తుంది అంటూ వైఎస్ జగన్ పైన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. హిందూపురంలో బాలకృష్ణ ఓడిపోతున్నాడు, పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపోతున్నాడు. కుప్పంలో చంద్రబాబు నాయుడు కూడా ఘోర పరాజయం చవిచూడబోతున్నాడు. వార్ వన్ సైడ్ జరిగింది. అనంతపురం పరిధిలోని 14 అసెంబ్లీ సీట్లు మొత్తం మావే. ప్రజలను పేకాటాడేసుకున్న తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వరు.
 
తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. బెట్టింగులంటూ ముంచేయాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 గురించి కాదు, అమరావతి రాజధాని ద్వారా ఆర్జిద్దాము అనే కోణంలో ఆలోచిస్తున్నాడు. జగనన్న సంక్షేమ కార్యక్రమాలను అనుభవిస్తున్న ప్రజలు ఉదయం 6 గంటలకు బారులు తీరారు.
 
జగన్ గారి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభంజనం నడిచింది. మేము 164 సీట్లతో అధికారంలోకి రాబోతున్నాము. జగన్ గారు వైనాట్ 175 అని ఊరికే చెప్పలేదు. ప్రజలంతా తమ పక్షాన వున్న విషయం తెలుసు కనుకనే అలా చెప్పారు. ఈ విషయాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు కూడా జూన్ 4న తెలుస్తుంది. అందుకే 4 తేదీ వరకూ మేమే గెలుస్తున్నాము అని కలలు కంటూ వుండండి. చివరికి వచ్చేది, ప్రజలు కోరుకున్న జగనన్న రాజ్యమే అంటూ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments