రైతే రాజు.. అలాంటి రైతుకు మేలు జరగాలన్నదే లక్ష్యం : సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (15:50 IST)
రైతే రాజు అని, అలాంటి రైతుకు అన్ని విధాలుగా మేలు జరగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిస్సాన్ పథకం కింద జమ చేసే నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లోకి శుక్రవారం బదిలీ చేశారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, రైతు భరోసాకు సంబంధించి అర్హత ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హత ఉన్న రైతులు మరో నెల రోజుల వరకైనా నమోదు చేసుకోవచ్చన్నారు. 
 
మేనిఫెస్టోలో ఇచ్చిన దానికంటే ఎక్కువ చేయగలుగుతున్నామన్నారు. ముందుగా చెప్పిన దానికంటే ఎక్కువగా రూ.13,500 ఇవ్వగలుగుతున్నామన్నారు. పెట్టుబడి సాయంతో రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉందన్నారు. 
 
మేలోనే రూ.7,500 ఇవ్వాలనుకున్నాం.. కానీ కరోనా కారణంగా ఏప్రిల్‌లో రూ.2 వేలు ఇచ్చామని తెలిపారు. జూన్‌ పంటకు సన్నద్ధమయ్యేందుకు పెట్టుబడి కోసం రూ.5,500 ఇస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అటవీ ప్రాంతంలో భూములు సాగుచేసుకుంటున్న వారికి రైతు భరోసా అందుతుందని స్పష్టంచేశారు. 
 
సంక్రాంతి వేళ మూడో విడతగా మరో రూ.2 వేలు అందిస్తామని వివరించారు. రైతు భరోసాకు సంబంధించి అర్హత ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలన్నది మా ప్రభుత్వం లక్ష్యం. కులాలు, మతాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి రైతుకు ప్రయోజనం చేకూరుతుంది. రైతుల పాత అప్పులకు జమ కాకుండా నగదు అందిస్తున్నాం. బ్యాంకుల నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే 1902కు ఫోన్‌ చేయవచ్చు. రైతుకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పని చేస్తోందని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments