Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం - చీఫ్‌గా తోట చంద్రశేఖర్

Webdunia
ఆదివారం, 21 మే 2023 (14:58 IST)
భారత రాష్ట్ర సమితి ఏపీ శాఖ కార్యాలయాన్ని ఏపీలో ప్రారంభించారు. గుంటూరులో ఐదు అంతస్తుల భవనంలో పార్టీ ఆఫీసును నెలకొల్పారు. దీన్ని ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ ప్రారంభించారు. ఆదివారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. 
 
2024 అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ ప్రారంభించారు. కాగా, ఐదు అంతస్తుల భవనంలో మొదటి అంతస్తులో కార్యకర్తలతో సమావేశ మందిర, రెండు మూడు అంతస్తుల్లో పరిపాలను విభాగాలకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. 
 
ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పోషించేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేస్తుందని తెలిపారు. ఇప్పటికే మహారాష్ట్రలో దూకుడు ప్రదర్శిస్తుందన్నారు,.
 
పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే మహారాష్ట్రలో పలు సభలు, సమావేశాలు నిర్వహించారని తెలిపారు. మహారాష్ట్ర, ఏపీలతో పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా  సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సభలు, సమావేశాలతో పాటు పార్టీని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments