Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎద్దును ఢీకొని చొట్టపడిన వందే భారత్ రైలు

Webdunia
ఆదివారం, 21 మే 2023 (13:54 IST)
వందే భారత్ రైలు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు ప్రవేశపెట్టిన సెమీ హై స్పీడ్ రైలు. దేశంలో దీన్ని మించిన రైలు లేదంటూ విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ, ఈ రైలు ఫిట్నెస్ ఇపుడు ప్రమాదకరంగా మారింది. చిన్నపాటి ఎద్దును ఢీకొట్టడంతో వందే భారత్ రైలు చొట్టబడింది. ఓ ఎద్దు పట్టాలపైకి దూసుకుని రావడంతో దాన్ని వందే భారత్ రైలు ఢీకొట్టింటి. దీంతో రైలు ముందు భాగం బాగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన తర్వాత ఈ ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని కోల్వా - అరానియా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదంలో రైలులోని ప్రయాణికుల్లో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. కానీ, రైలు ముందు భాగం మాత్రం బాగా చొట్టబడిపోయింది. ఈ ఘటన తర్వాత వందే భారత్ రైలు 15 నుంచి 20 నిమిషాల పాటు ఆగిపోయింది. ఆ తర్వాత అధికారులు, రైల్వే సిబ్బంది వచ్చి ఎద్దును తొలగించిన తర్వాత తిరిగి బయుదేరింది. 

సంబంధిత వార్తలు

తొలి రోజు బాక్సాఫీస్ వద్ద 1.82 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్న గం..గం..గణేశా

యేవ‌మ్ నుంచి ర్యాప్ సాంగ్ విడుద‌ల చేసిన త‌రుణ్‌భాస్క‌ర్

రజాకార్ ఉద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర లేదు - దర్శకుడు యాట

హరి హర వీర మల్లు పూర్తి చేయడానికి ఏఎం రత్నం టీమ్ చర్చలు

ఐస్ బాత్ చేస్తూ వీడియోను పంచుకున్న చిరుత హీరోయిన్ నేహా శర్మ (video)

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

జెన్ జెడ్ ఫ్యాషన్-టెక్ బ్రాండ్ న్యూమీ: హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో అతిపెద్ద రిటైల్ స్టోర్‌ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments