Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవ మృగంలా శవాలు పీక్కుతినే రాబందులా మారిన జగన్.. పిచ్చెక్కింది: ఆనం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానంద రెడ్డి ఫైర్ అయ్యారు. జగన్‌కు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తూ పదే పదే ప్రభుత్వ పాలనను విమర్శిస్తున్నారని ఆనం మండిప

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2016 (11:00 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానంద రెడ్డి ఫైర్ అయ్యారు. జగన్‌కు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తూ పదే పదే ప్రభుత్వ పాలనను విమర్శిస్తున్నారని ఆనం మండిపడ్డారు. ఆదివారం ఆనం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ సమాధి అయిపోయే పరిస్థితిలో జగన్ అంతిమ పోరాటం చేస్తున్నారన్నారు.

రాయలసీమ రైతులను ఆదుకునేందుకు సీఎం శ్రమిస్తుంటే చూసి ఓర్వలేని జగన్ ధర్నాలు, బంద్‌లు అంటూ పిలుపునివ్వడం సిగ్గు చేటన్నారు. మానవ మృగంలా శవాలు పీక్కుతినే రాబందులా జగన్ తయారయ్యాడని విమర్శించారు.
 
అవినీతి ఊబిలో చిక్కుకుపోయిన జగన్ నారా లోకేశ్‌ను విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. పద్ధతి మార్చుకుని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు. నదిలో కొట్టుకుపోతున్న నావను నావికుడు ఏ విధంగా రక్షిస్తాడో ఆ తరహాలోనే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రగతి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. రేపటి తరం కోసం ఆయన చేస్తున్న పోరాటానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments