Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో పోలీసుకు పవర్ తుస్... వృద్ధుడు కూడా బాదేస్తాడంతే... (Video)

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (18:18 IST)
ఏపీలో పోలీసులకే రక్షణ లేకుండాపోయింది. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ తమ్ముళ్లకు పోలీసులన్నా లెక్కలేకుండాపోయింది. జిల్లా టీడీపీ ఆఫీస్‌లో ఆపరేటర్‌గా పనిచేసే యుగంధర్‌ నాయుడు తండ్రి చంద్రశేఖర్ నాయుడు ఏకంగా నడిరోడ్డుపైనే కానిస్టేబుళ్లు కర్ర తీసుకుని చితకబాదాడు. పోలీసులైతే ఏం పీకుతార్రా... అంటూ కర్ర తీసుకుని పదేపదే కొట్టాడు. దీంతో కానిస్టేబుల్‌ తలకు గాయమైంది. 
 
ఈ దృశ్యాలను కొందరు మొబైల్‌లో చిత్రీకరించడంతో సంచలనంగా మారింది. జిల్లాలోని పెనుమూరు మండల కేంద్రంలో ఒక స్థల వివాదం కోర్టుకు చేరింది. ఆ స్థలంలో ఎవరూ పనులు చేపట్టవద్దని కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయితే చంద్రశేఖర్‌ నాయుడు జేసీబీ సాయంతో స్థలంలో పనులు చేపట్టారు. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ… పనులను అడ్డుకునేందుకు కానిస్టేబుల్‌ రమేష్‌ను పంపించాడు. అక్కడికి వెళ్లిన రమేష్ కోర్టు ఆదేశాలను చూపించి ఇక్కడ పనులు చేయడం నేరమని చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో చంద్రశేఖర్‌ నాయుడికి కోపం వచ్చింది. నీవు ఎవడ్రా నాకు చెప్పడానికి అంటూ కర్ర తీసుకుని మహిళల సమక్షంలోనే కానిస్టేబుల్‌ను చితకబాదాడు. చూడండి వీడియో... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments