Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రూ.40లక్షల పొగాకు దగ్ధం.. ఎలా?

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (11:12 IST)
రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌లో మంటలు చెలరేగడంతో ఒక వ్యక్తి గాయపడి రూ.40 లక్షల విలువైన పొగాకు దగ్ధమైంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది.
 
108 అంబులెన్స్‌లో డయాలసిస్‌ కోసం ఒక రోగిని రాజాసాహెబ్‌పేట గ్రామం నుంచి ఆసుపత్రికి తీసుకువెళుతున్నారు. కొంత దూరం వెళ్లగానే డ్రైవర్ తిరుపతిరావు క్యాబిన్‌లో పొగలు రావడం గమనించాడు. వెంటనే అంబులెన్స్‌ను ఆపి సహచరుడు మధుసూధన్‌రెడ్డిని అప్రమత్తం చేశాడు. తరువాతి రోగికి, అతనితో పాటు ఉన్న అతని తల్లికి బండి నుంచి దించేందుకు సాయపడ్డాడు. 
 
షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా చెలరేగిన మంటలు కొద్దిసేపటికే వాహనం మొత్తం వ్యాపించాయి. అంబులెన్స్‌లో ఉంచిన ఆక్సిజన్ సిలిండర్ పేలింది. ఈ వాహనం నుంచి వెలువడిన మంటలు సమీపంలోని రైతులు పొగాకు నిల్వ చేసిన షెడ్‌పై పడింది. దీంతో ఆ షెడ్‌లోని మొత్తం పొగాకు స్టాక్ బూడిదగా మారింది. దీంతో రూ.40 లక్షల నష్టం వాటిల్లిందని షెడ్డులో పొగాకు నిల్వ ఉంచిన ముగ్గురు రైతులు తెలిపారు.
 
షెడ్డు దగ్గర నిలబడిన వ్యక్తికి కూడా ఈ ఘటనతో గాయాలైనాయి. అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments