Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబేద్కర్ స్మృతివనం పనులు వేగవంతం చేయాలి: కృష్ణాజిల్లా కలెక్టర్

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (09:18 IST)
విజ‌య‌వాడ‌ నగరంలోని స్వరాజ్య మైదానంలో భారతరత్న డా. బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహంతో పాటు స్మృతివనం పనులు మరింత వేగవంతం చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక స్వరాజ్య మైదానాన్ని సందర్శించి అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ పనులపై అధికారులతో జిల్లా కలెక్టర్ నివాస్ సమీక్షించి పలు సూచనలు ఇచ్చారు.

సుమారు 20 ఏకరాల విస్తీరణంలో రూ.249 కోట్లతో డా.బిఆర్ అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం అమలు పర్యవేక్షణకు సాంఘిక సంక్షేమ శాఖను నోడల్ ఏజన్సీగా నియమించింది. ఏపీఐఐఎస్ సి కూడా పనుల నిర్వహణతో కూడా భాగస్వామ్యం చేశారు.

వచ్చే ఏడాది ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ జన్మదినోత్సవం నాటికి స్వరాజ్య మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, స్మృతివనం, అధ్యయన కేంద్రాలు వంటివి ప్రారంభానికి సిద్ధం చేయాలని ప్రభుత్వం సంకల్పించిన దృష్ట్యా ఆ మేరకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలన్నారు.

అందుకు అవసరమైన కార్యచరణ అమలు చేయాలన్నారు. స్మృతివనం ఏర్పాటుకు ఇప్పటికే స్వరాజ్య మైదానంలో ఉన్న వివిధ శాఖలకు చెందిన కార్యాలయాలను తరలించడం జరిగిందన్నారు. ఇప్పటికే శిధిలావస్థ, నిరుపయోగంలో ఉన్న ఇరిగేషన్ క్వార్టర్స్ ను తొలగించడం జరిగిందని అయితే ఖాళీ అయిన మిగిలిన భవనాలను కూడా త్వరితగతిన తొలగించి స్మృతివనం పనులను వేగవంతం చేయాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments