Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేజాన్‌కు చుక్కలు చూపించిన తెలంగాణ వ్యక్తి..

Webdunia
ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (10:53 IST)
ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమేజాన్‌కు భారత్ యువకుడు చుక్కలు చూపించాడు. అమేజాన్ సైట్ ద్వారా విలువైన వస్తువులను ఆ వ్యక్తి కొనుగోలు చేసేవాడు. విలువైన వస్తువులను ఆర్డర్ చేసి ఆ తర్వాత వివిధ కారణాలతో వాటిని తిప్పి పంపేవాడు. అయితే, అలా పంపినవి నకిలీవని తేలడంతో అమేజాన్ విస్తుపోయింది. మోసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
తెలంగాణలోని జగిత్యాలలో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళితే.. జగిత్యాలకు చెందిన అరుణ్.. అమేజాన్ సైట్ ద్వారా విలువైన వస్తువులను కొనుగోలు చేసేవాడు. ఆ తర్వాత ఆ వస్తువులను వద్ద ఉంచుకుని నకిలీలను రిటర్న్ చేసేవాడు.
 
ఇలా మొత్తంగా రూ.8 లక్షల విలువైన వస్తువులు కొనుగోలు చేసి నకిలీ వస్తువులను తిప్పి పంపాడు. ఒకే వ్యక్తి నుంచి ఎక్కువగా రిటర్న్ వస్తుండడంతో అనుమానించిన అమేజాన్ వెనక్కు వచ్చిన వాటిని పరిశీలించడంతో మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో అమెజాన్ లీగల్ టీం అరుణ్‌పై జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments