Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవిందా..గోవిందా, అద్భుతం.. శేషాచలం కొండల్లో...

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (19:27 IST)
తిరుమల వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న ప్రాంతమంటేనే ఒక ప్రత్యేకత. ఏడుకొండపై ఉన్న స్వామివారిని దర్సించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వచ్చి వెళుతుంటారు. అలాంటి ప్రాంతం ఇప్పుడు మరింత అందంగా.. అద్భుతంగా దర్సనమిస్తోంది.
 
గత వారంరోజుల నుంచి తిరుపతిలో వర్షం పడుతోంది. కాసేపు వర్షం పడినా శేషాచలం కొండలు మాత్రం పచ్చగా కనిపిస్తున్నాయి. ఎండాకాలంలో అటవీ ప్రాంతంలోనే చెట్లన్నీ ఎండిపోయి కళావిహీనంగా మారిపోతే ప్రస్తుతం వర్షం కారణంగా ఎంతో అందంగా శేషాచలం కొండలు కనిపిస్తున్నాయి.
 
దాంతో పాటు తిరుమలలో పడిన వర్షానికి కొండల మధ్య నుంచి నీరు జాలువారి తిరుపతిలోని కపిలతీర్థంలోకి వస్తోంది. మాల్వాడి గుండం నుంచి కపిలేశ్వర ఆలయంలోకి వస్తున్న నీటిని భక్తులు, స్థానికులు ఆహ్లాదకరంగా తిలకిస్తున్నారు. మరోవైపు తిరుమల ఘాట్ రోడ్లలో మంచు దుప్పట్లు కనిపిస్తున్నాయి. 
 
మంచు కొండలను దట్టంగా కప్పడంతో పాటు చిరుజల్లులు పడుతుండడంతో ఘాట్ రోడ్లలో వెళ్ళే భక్తులు కొత్త లోకంలో విహరిస్తున్నారు. ఎంతో అద్భుతమైన దృశ్యాలు శేషాచలం కొండల్లో కనిపిస్తుండడంతో భక్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పరిమిత సంఖ్యలో భక్తులు వస్తున్నా తిరుపతిలోని వాతావరణానికి మంత్రముగ్థులు అవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments