Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రాజధాని ఉద్యమానికి నేటితో 900 రోజులు

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (12:23 IST)
అమరావతి రాజధాని ఉద్యమానికి నేటితో 900 రోజులు అయ్యాయి. ఉద్యమం 900 రోజులకు చేరిన సందర్భంగా అమరావతి రైతులు న్యాయదేవతకు పాలాభిషేకం చేశారు. రాజధాని ఉద్యమ వీరులకు నివాళులు అర్పించనున్నారు. 
 
శనివారం విజయవాడలో 'హైకోర్టు తీర్పు-సర్కారు తీరు' పేరిట సదస్సు నిర్వహించనున్నారు. అమరావతిని రాజధానిగా సాధించేంతవరకు పోరాటం ఆపబోమని రైతులు స్పష్టం చేస్తున్నారు. 
 
కాగా, టీడీపీ అధికారంలో వుండగా అమరావతి కోసం భూములిచ్చిన రైతులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడంతో రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులు హతాశులయ్యారు. అయితే, రాజధాని కోసం వారు వీరు అన్న తేడా లేకుండా, రైతులు, మహిళలు, పిన్నలు, పెద్దలు దీక్ష ప్రారంభించారు. 
 
2019 డిసెంబరు 17న మొదలైన ఆ దీక్ష నేటితో 900 రోజులకు చేరింది. ఈ రాజధాని ఉద్యమం వివిధ రూపాల్లో సాగింది. ప్రభుత్వ నిర్ణయాలు తమకు వ్యతిరేకంగా ఉన్నా, కోర్టు తీర్పులు వారికి ఎనలేని ఊరటనిచ్చాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments