Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రాజధాని రైతులు ఉద్యమానికి ఒక యేడాది!

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (15:37 IST)
మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమానికి ఒక యేడాది కానుంది. ఈ నెల 17వ తేదీతో ఒక సంవత్సరం పూర్తికానుంది. ఈ నేపథ్యంలో అమరావతి రాజకీయేతర ఐక్య కార్యాచరణ సమితి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు ప్రణాళిక వేసుకుంది. 
 
రేపటి నుంచి ఆరు రోజుల పాటు వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేయాలని నిర్ణయం తీసుకుంది. తొలి రోజైన రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుంటూరులో మహా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల 14న తుళ్లూరులో కిసాన్ సమ్మేళనాన్ని నిర్వహిస్తారు. 
 
ఈ నెల 15న విజయవాడలో రాజధాని పరిరక్షణ పాదయాత్రను చేస్తారు. చివరిరోజయిన ఈ నెల 17న ఉద్ధండరాయునిపాలెంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఈ నెల 13, 16న కూడా నిరసనలు తెలుపుతారు. తమ ఉద్యమం ఇక్కడితో ఆగిపోదని, అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించే వరకు కొనసాగిస్తూనే ఉంటామని ఐకాస నేతలు స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments