Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి.. స్కూటీపై పడ్డాయి.. టీచర్ సజీవదహనం

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (14:59 IST)
రాజస్థాన్‌లో ఘోరం జరిగిపోయింది. హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి.. రోడ్డుపై వెళ్తున్న స్కూటీపై పడ్డాయి. ఈ ఘటనలో స్కూల్ టీచర్ మృతి చెందారు. ఈ ఘటన జరగడానికి కాసేపటికి ముందే ఆ ప్రాంతంలో వర్షం పడడంతో రోడ్డంతా తడిగా ఉంది. అందుకే తమకూ షాక్ తగులుతుందనే భయంతో.. ఎవరూ ఆమె వద్దకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. అలా క్షణాల్లోనే స్కూటీ కాలి బూడిదయింది.
 
వివరాల్లోకి వెళితే... బాగిదౌరాకు చెందిన నీలం పాటిదార్ అనే మహిళ.. స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం తన ఇంటి నుంచి స్కూటీపై నౌగామాకు బయలుదేరారు. రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి స్కూటీపై పడ్డాయి. అది 11 కేవీ విద్యుత్ లైన్ కావడంతో వెంటనే మంటలు అంటుకున్నాయి. రోడ్డుపై అందరూ చూస్తుండగానే క్షణాల్లో బండి తగలబడిపోయింది. టీచర్ నీలం కూడా సజీవ దహనమయ్యారు. 
 
అందరి కళ్ల ముందే హాహా కారాలు చేస్తూ కన్నుమూశారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటన స్థానికంగా అందరినీ కంటతడి పెట్టింది. అదే సమయంలో భయాందోళనకు గురిచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments