Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రాజధాని కోసం రైతుల మహా పాదయాత్ర

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (11:04 IST)
అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ మహా పాదయాత్రకు పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లులో రైతుల పాదయాత్రపై అమరావతి జేఏసీ నేతల దగ్గరకు అడిషనల్ ఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో నలుగురు డీఎస్పీలు వెళ్లారు. నిబంధనలకు అనుగుణంగా పాదయాత్ర కొనసాగించాలని ఆదేశాలు జారీచేశారు. మహా పాదయాత్రపై మొత్తం మూడు కేసులు నమోదు చేశారు జిల్లా పోలీసులు.
 
ఇప్పటికే మాహాపాదయాత్రపై జిల్లా పోలీసులు మూడు కేసులు నమోదు చేయగా.. మహా పాదయాత్ర సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు పోలీసులు. పాదయాత్ర సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసులు వెల్లడించారు. అయితే నిబంధనలకు అనుగుణంగానే పాదయాత్ర నిర్వహిస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
 
అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 8వ రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లా ఇంకొల్లు నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. తొమ్మిదవ రోజు ఇంకొల్లు నుంచి దుద్దుకూరు వరకు యాత్ర సాగనుంది. పర్చూరు నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతుంది. పాదయాత్రకు కొన్ని రాజకీయ పార్టీల సంఘీభావం ప్రకటించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments