Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని అమరావతి ఉద్యమానికి తాత్కాలిక విరామం?

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (08:29 IST)
నవ్యాంధ్ర రాజధాని కోసం అమరావతి రైతులు నిర్వహిస్తూ వచ్చిన ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతేనంటూ ఇటీవల ఆంధ్రప్రదశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైన హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీంతో రాజధాని ప్రాంత రైతులు వందల రోజులుగా కొనసాగిస్తూ వచ్చిన ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించాలన్న ఆలోచనలో జేఏసీ నేతలు ఉన్నారు. 
 
ఇదే అంశంపై చర్చించేందుకు ఇటీవల సమావేశమైన జేఏసీ నేతలు... ఏపీ రాజధాని అమరావతే అని కోర్టు తేల్చి చెప్పినందున ఉద్యమానికి తాత్కాలికంగా కొంత విరామం ప్రకటించాలని కొందరు నేతలు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే, ప్రధాన ఉద్యమ శిబిరాలు మాత్రం కొనసాగించాలని మరికొందరు చెప్పారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల వరకు కొనసాగించి ఆ తర్వాత తాత్కాలిక విరామం ప్రకటిద్దామని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. 
 
అమరావతే ఎలగూ రాజధాని అని కోర్టు చెప్పింది కాబట్టి అభివృద్ధి పనులు ప్రారంభించాలని ఉద్యమం చేపడుదామని రైతులు న్యాయకు పేర్కొన్నారు. అయితే, సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల వరకు శిబిరాలు కొనసాగించి ఆ తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకుని తదుపరి కార్యాచరణ రూపొందించాలని సమావేశంలో రాజధాని ఉద్యమ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments