Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖకు అమరావతి రైతులు బస్సు యాత్ర, ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (18:17 IST)
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలకు సంఘీభావంగా అమరావతి రైతులు బస్సు యాత్ర చేపట్టారు. ఆందోళన చేస్తున్న వారికి మద్దతు తెలిపేందుకు రాజధాని రైతులు వెలగపూడి నుంచి బయలుదేరారు. 
 
29 గ్రామాల నుంచి మూడు బస్సుల్లో.. విశాఖ వెళ్లి అక్కడ ఆందోళన చేస్తున్న వారికి సంఘీభావం తెలుపుతారు. రైతుల బస్సు యాత్రను గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, రాజధాని పరిరక్షణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ జెండా ఊపి బస్సు యాత్ర ప్రారంభించారు. 
 
"విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు ఈ యాత్ర చేపట్టాం" అని నేతలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరిని తిప్పికొడతామన్నారు. ప్రజలను మోసం చేసేందుకు కుతంత్రాలకు తెర తీశారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments