Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు అమరావతి రైతుల మహోద్యమ ముగింపు సభ

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (12:47 IST)
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో అమరావతి రైతులు చేపట్టిన మహోద్యమ పాదయాత్ర ముగింపు బహిరంగ సభ శుక్రవారం తిరుపతిలో జరుగనుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో వారు ఏకధాటిగా 44 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర చివరి అంకంగా తిరుపతిలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఇప్పటికే ఆ ప్రాంత రైతులు, మహిళలు ఈ పాదయాత్రలో భాగస్వామ్యులైన విషయం తెల్సిందే.
 
ఈ నేపథ్యంలో అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ పేరుతో నిర్వహించే ఈ బహిరంగ సభకు పలు రాజకీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని రైతుల సంఘాల సమాఖ్య ఐకాస నేతలు వెల్లడించారు. ఈ బహిరంగ సభ తిరుపతి పరిధిలోని దామినీడు అనే ప్రాంతంలో జరుగనున్నాయి. 
 
ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తుండటంతో భారీగానే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు హాజరుకానున్నారు. కాగా, ఈ సభ సాయంత్రం 6 గంటలకు ముగించాలని హైకోర్టు షరతు విధించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments