Webdunia - Bharat's app for daily news and videos

Install App

మింగడానికి మెతుకు లేదుగానీ... 33 రాజధానులా?

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (16:09 IST)
నవ్యాంధ్ర రాజధాని తరలింపు అంశంపై రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, రాజధానిని మరో ప్రాంతానికి తరలించడానికి వీల్లేదని వారు డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తారు. ఈనేపథ్యంలో తుళ్లూరులో రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నారు. వీరికి టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మద్దతు తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, 'మింగడానికి మెతుకు లేదుగానీ.. 33 రాజధానులు నిర్మిస్తారా...? నిజంగా అంత ధైర్యముంటే అమరావతి నిర్మాణం పూర్తి చేశాక.. ఎన్ని రాజధానులు నిర్మిస్తావో నిర్మించు' అంటూ సవాల్ విసిరారు. 
 
నాడు అమరావతికి అంగీకరించిన జగన్‌.. ఇవాళ ఎందుకు ప్లేటు మార్చారంటూ నిలదీశారు. రాజధాని మార్పు సీఎం సొంత సమస్య కాదని.. 5 కోట్ల మంది ప్రజలదని, రైతుల పోరాటానికి అండగా ఉంటామని గొట్టిపాటి రామకృష్ణ అన్నారు.
 
అలాగే, బీజేపీ నేత గోపీనాథ్ దాస్ స్పందిస్తూ, రాష్ట్రంలో రావణరాజ్యం నడుస్తోందని.. ప్రజల కష్టాలు చూస్తూ సీఎం జగన్‌ రాక్షస ఆనందం పొందుతున్నారంటూ మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments