Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని మంటలు : మందడంలో మహిళలపై పోలీసులు దాడి

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (15:46 IST)
రాజధాని అమరావతి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని రైతుల పరిరక్షణ సమితి పిలుపు మేరకు శుక్రవారం నుంచి సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. దీంతో రాజధాని ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల ప్రజలు సమ్మెకు దిగారు. 
 
ఈ సమ్మెలోభాగంగా, శుక్రవారం మధ్యాహ్నం మందడంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు మహిళా రైతులను పోలీసులు అరెస్టు చేసి, అక్కడి నుంచి తరలించబోయారు. పోలీసుల తీరును నిరసిస్తూ గ్రామస్తులు ఎదురుతిరిగి, వాగ్వివాదానికి దిగారు. 
 
రైతులను పోలీసులు వాహనంలో ఎక్కిస్తుండగా అడ్డుపడ్డారు. దీంతో పోలీసు వాహనం టైరు చేతిపైకి ఎక్కడంతో ఓ రైతుకి గాయాలయ్యాయి. పోలీసుల తీరు సరిగాలేదంటూ పోలీసు వాహనానికి ఎదురుగా రైతులు పడుకున్నారు. దీంతో వారిని పోలీసులు అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. 
 
మహిళల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనను వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ముక్తకఠంతో ఖండించారు. పోలీసుల తీరును ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. అధికార పార్టీ నేతల చేతిలో పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments