Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని మంటలు : మందడంలో మహిళలపై పోలీసులు దాడి

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (15:46 IST)
రాజధాని అమరావతి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని రైతుల పరిరక్షణ సమితి పిలుపు మేరకు శుక్రవారం నుంచి సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. దీంతో రాజధాని ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల ప్రజలు సమ్మెకు దిగారు. 
 
ఈ సమ్మెలోభాగంగా, శుక్రవారం మధ్యాహ్నం మందడంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు మహిళా రైతులను పోలీసులు అరెస్టు చేసి, అక్కడి నుంచి తరలించబోయారు. పోలీసుల తీరును నిరసిస్తూ గ్రామస్తులు ఎదురుతిరిగి, వాగ్వివాదానికి దిగారు. 
 
రైతులను పోలీసులు వాహనంలో ఎక్కిస్తుండగా అడ్డుపడ్డారు. దీంతో పోలీసు వాహనం టైరు చేతిపైకి ఎక్కడంతో ఓ రైతుకి గాయాలయ్యాయి. పోలీసుల తీరు సరిగాలేదంటూ పోలీసు వాహనానికి ఎదురుగా రైతులు పడుకున్నారు. దీంతో వారిని పోలీసులు అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. 
 
మహిళల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనను వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ముక్తకఠంతో ఖండించారు. పోలీసుల తీరును ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. అధికార పార్టీ నేతల చేతిలో పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments