Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్‌ నాశనానికే!

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (18:14 IST)
మూడు రాజధానులు ఆంధ్ర ప్రదేశ్‌ నాశనానికి దారి తీస్తాయి, అమరావతిలోనే ఒకే ఒక్క శాశ్వత రాజధాని కొనసాగుంపుపై తక్షణం పునరాలోచన చేయాలంటూ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్‌ చేసారు. అమరావతిలో రాజధాని కొన‌సాగించాల‌ని గుంటూరు జిల్లా మోతడక గ్రామంలో జరుగుతున్న దీక్షలు 666వ రోజుకు చేరిన సందర్భంలో బుధవారం ధర్నా శిబిరంలో మహా సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ తలరాతలు మార్చగల్గేది అమరావతి రాజధాని ఒక్కటే అన్నది సి.ఎం వై.ఎస్‌.జగన్‌ గుర్తెరగాలని అన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధి నిర్మాణ కేంద్రం కాగలదన్నారు. ఇక ఈ ఉద్యమాన్ని రాష్ట్రమంతటా విస్తరింపచేసి ఉదృతం చేయాలన్నారు. 
 
న‌వంబర్‌ 1వ తేదీ నుంచి తిరుమలకు ప్రారంభం అయ్యే పాదయాత్రలో సి.పి.ఐ భాగస్వామ్యం కాగలదన్నారు. హైకోర్టు న్యాయవాది చిగురుపాటి రవీంద్ర బాబు రచించిన గేయాలను కళాకారులు పివి రమణ, రాజేష్‌ ఆలపించిన ‘‘అమరావతి ఉద్యమ గీతాలు’’ ఆడియో సి.డి లను గ్రామ సర్పంచ్‌ పార్వతమ్మ  జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ కూచిపూడి విజయమ్మ ఆవిష్క‌రించారు.
 
సభలో మాజీ శాసన సభ్యులు వైవి ఆంజనేయులు, జెఎసి కన్వీనర్‌ సుధాకర్‌, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావ్‌, తెలుగు రైతు గుంటూరు పార్లమెంట్‌ నియోజక కన్వీనర్‌ కళ్లం రాజశేఖర రెడ్డి, జెఎసీ నేతలు కంచర్ల శివరామయ్య, డాక్టర్‌ రాయపాటి శైలజ, కంచర్ల సాంబశివరావు, స్వరాజ్య రావు, రఘునాధ రావు, అనీల్‌, మన్నవ శారద, కె.శ్రీనివాసరావు, పోతుల బాలకోటయ్య తదితరులు ప్రసంగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments