Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఇంజనీరింగ్ కాలేజీ ఛైర్మన్ ఆత్మహత్య.. ఎందుకంటే..

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (12:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఛైర్మన్ బలవన్మరణానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని అమరా ఇంజనీరింగ్ కాలేజీ ఛైర్మన్‌గా వెంకటేశ్వర రావు ఉన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.

ఆర్థిక కష్టాలతో పాటు బ్యాంకర్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఈయన సోమవారం పురుగుల మందు సేవించి బలవన్మరణానికిపాల్పడ్డారు. వెంకటేశ్వర రావు పురుగుల మందు సేవించిన విషయాన్ని గుర్తించిన బంధువులు వెంటనే చికిత్స నిమిత్తం పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్య కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించండంతో ఆయన అక్కడ తుదిశ్వాస విడిచారు. 
 
మృతుడి భార్య సుధారాణి వెల్లడించిన వివరాల మేరకు.. గత 2011లో కెనరా బ్యాంకు నుంచి కాలేజీ తరపున రూ.13 కోట్ల రుణం తీసుకున్నారు.

2017 వరకు రూ.25 కోట్లను తిరిగి చెల్లించామని తెలిపారు. అయితే అప్పటికీ అప్పు తీరలేదని బ్యాంకు అధికారులు కోర్టును ఆశ్రయిస్తే కళాశాల సామాగ్రిని యాజమాన్యానికి అప్పగించి కళాశాలకు తాళం వేసుకోవచ్చని తీర్పునిచ్చిందన్నారు. కానీ, కెనరా బ్యాంకు అధికారులు మాత్రం సామాగ్రిని ఇవ్వకుండా కాలేజీ మొత్తానికి సీజ్ చేశారని తెలిపారు. 
 
అప్పటి నుంచి నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, బెంగుళూరులలో కెర్ బ్యాంకు బ్రాంచీలకు వెళ్లి వివరాలు తెలిపినా ఏ ఒక్క బ్యాంకు అధికారి స్పందించలేదని ఆమె బోరున విలపిస్తూ వెల్లడించారు. పైగా, 2017 నుంచి ఇప్పటివరకు నోటీసులు పంపించి వేధిస్తూనే ఉన్నారని తెలిపారు.

కాలేజీలో ఉన్న సామాగ్రి రూ.16 కోట్లమేరకు వస్తాయని, వాటిని అమ్మితే బ్యాంకు అప్పు తీరిపోతుందన్నారు. కానీ బ్యాంకు అధికారులు తమ మొరను ఆలకించలేదని, ఫలితంగా తన భర్త అమరా వెంకటేశ్వ రావు తీవ్ర మనస్తానికి గురై ఆత్మహత్య చేసుకున్నారని వాపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments