Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనపని అయిపోయింది పక్కకు పోదామన్న జ్ఞానం కూడా లేదు : ఆళ్ళ రామకృష్ణారెడ్డి

Webdunia
గురువారం, 18 జులై 2019 (16:53 IST)
టీడీపీ నేతలతో పాటు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి మరోమారు మాటల తూటాలు పేల్చారు. గత ఎన్నికల్లో చిత్తుగా ఓడించినా టీడీపీ నేతలకు బుద్ధిరావడం లేదన్నారు. పైగా, మన పని అయిపోయింది పక్కకు పోదామన్న జ్ఞానం కూడా లేదంటూ మండిపడ్డారు. 
 
ఆయన గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ, కృష్ణానది కరకట్టపై ఉన్న భవనాల కూల్చివేతకు ఇప్పటికే 70 భవనాలకు నోటీసులు ఇచ్చారనీ, అయినా ఏ ఒక్కరూ స్పందించడం లేదన్నారు. పైగా, కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ ప్రభుత్వ భవనం అని 2016 మార్చి ఆరో తేదీన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారని ఆర్కే గుర్తుచేశారు. 
 
అంతేకాకుండా, ప్రజలు ఓడించినా కూడా తెలుసుకోలేక పోతున్నారన్నారు. 'మన పని అయిపోయింది. పక్కకు వెళ్లిపోదాం' అనే జ్ఞానం కూడా లేకుండా ఇంకా నేను ఇక్కడే ఉంటా. నన్ను ఎవరు కదిలిస్తారు.. అంటూ కనీసం మనిషికున్న విలువ, విజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా కరకట్టపై ఉన్న భవన యజమానులు తమ గృహాలను ఖాళీ చేయాలని కోరారు. 
 
ఇక ప్రజావేదిక గురించి ఆర్కే మాట్లాడుతూ, నాలుగు రేకులు, రెండు ఇటుకలు, ఓ గోడ ఇదే ప్రజావేదిక అని చెప్పారు. 'రూ.2 కోట్ల అంచనా పనులు. అదీ నామినేషన్ పద్ధతి కింద అప్పగించారు. చివరికి అంచనాలు రూ.10 కోట్లకు చేరాయి. తీరా చూస్తే నాలుగు రేకులు, రెండు ఇటుకలు, ఓ గోడ.. అంతకుమించి ఏమీ లేదు అధ్యక్షా. అలాంటి అక్రమ నిర్మాణాన్ని ప్రభుత్వం కూలిస్తే దాన్ని హర్షించాల్సిందిపోయి ఈ విధంగా చేయడం ఎంతమాత్రం సరికాదు' అంటూ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments