Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతల ఒత్తిడితోనే టీడీపీ ఆఫీసుపై దాడి.. కానీ ఆ రోజు నేను పొలంలో ఉన్నాను : ఆర్కే

ఠాగూర్
ఆదివారం, 1 జూన్ 2025 (10:35 IST)
విజయవాడ గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయపై తమ పార్టీ నేతల ఒత్తిడి మేరకు దాడి జరిగిందని, ఇలా దాడి చేయడం తప్పేనని వైకాపాకు చెందిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి (ఆర్కే) అభిప్రాయపడ్డారు. అయితే, ఈ దాడి గురించి తనకు తెలియదని, దాడి జరిగిన రోజున తాను పొలం పనుల్లో ఉన్నానని చెప్పారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆళ్ల పేరును సీఐడీ పోలీసులు 127వ నిందితుడుగా చేర్చిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో శనివారం ఆయన సీఐడీ విచారణకు హాజరయ్యారు. తన మిత్రుడుతో కలిసి స్కూటరుపై గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి వచ్చిన ఆళ్లను సీఐడీ అధికారులు రెండు గంటల పాటు విచారించారు. 
 
ఈ విచారణ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, దాడి జరిగిన రోజు తాను పొలంలో ఉన్న విషయాన్ని అధికారులకు చెప్పానని, వారు అడిగిన అన్ని ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు చెప్పినట్టు తెలిపారు. ఘటన జరిగిన ఒక యేడాది తర్వాత ఈ కేసులో తన పేరు చేర్చడం దారుణమన్నారు. 
 
ఈ దాడిలో తన పాత్ర ఏమాత్రం లేదన్నారు. గతంలో నారా లోకేశ్‌పై గెలిచినందుకే తనను ఈ కేసులో ఇరికించారన్నారు. 2014-29 వరకు చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించానని, అందుకే ఇపుడు రాజకీయ కక్షతో చార్జిషీటులో తన పేరును చేర్చారని చెప్పారు. ఈ కేసులో అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments