Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి నిర్మాణ పనులు మూడేళ్లలో పూర్తి : మంత్రి నారాయణ

ఠాగూర్
మంగళవారం, 24 డిశెంబరు 2024 (08:47 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులన్నీ వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక పనులను తిరిగి ప్రారంభించామన్నారు. మిగిలిన పనులను కూడా దశల వారీగా చేపడుతామన్నారు. అలాగే, రాజధాని అమరావతి పరిధిలో సుందరీకరణ పనులు కూడా ఒక్కొక్కటిగా ప్రారంభిస్తామని ప్రకటించారు. 
 
ఇదిలావుంటే, ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం, ప్రపంచ బ్యాంకు అండతో అమరావతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టించే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా అమరావతిలో మరో రూ.2723 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు సీఎం ఆమోదం తెలిపారు. సీఆర్డీయే 44వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
జూన్ 12వ తేదీ నాటికి 1.18 లక్షల టిడ్కో గృహాల నిర్మాణ పూర్తి చేసి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని రింగ్ రోడ్డు, విజయవాడ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. మరోవైపు, ఇప్పటివరకు రూ.47288 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఆర్డీయే ఆమోదం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas and Anushka: ప్రభాస్‌తో కలిసి నటిస్తాను అంటోన్న దేవసేన (video)

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments