Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్ మూడో వారానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా

Webdunia
సోమవారం, 13 జులై 2020 (19:58 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తుండడంతో విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌ సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వాయిదా వేసింది. సెప్టెంబర్‌ మూడో వారానికి ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సోమవారం నిర్ణయం తీసుకున్నారని విద్యుత్‌శాఖ మంత్రి ఆదిమలుపు సురేశ్‌ ప్రకటించారు.

మొత్తం 8 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే పదో తరగతి పరీక్షలను ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్‌ అసెన్‌మెంట్‌ మార్కుల ఆధారం విద్యార్థులందరినీ పాస్‌ చేసింది.
 
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జూలై 31 వరకు అన్ని కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. జూలై నెలాఖరు వరకు స్కూళ్లు, కాలేజీలు తెరవకూడదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. ఐతే డిగ్రీ పరీక్షలను మాత్రం ఖచ్చితంగా నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు వస్తున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోలేని పరిస్థితి నెలకొంది.ఏపీలో ఇప్పటి వరకు 31,103 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments