Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలిపిరి పేలుడు ఘటన.. నిర్దోషులుగా తేల్చిన కోర్టు

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2023 (12:57 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద జరిగిన దాడి కేసులో ముగ్గురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అక్టోబరు 2003లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
పీపుల్స్‌వార్ గ్రూపు పక్కా ప్రణాళికతో మందుపాతర పేల్చడంతో చంద్రబాబు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో పీపుల్స్‌వార్ గ్రూపు అగ్రనేతలు సహా మొత్తం 33మందిపై కేసులు నమోదయ్యాయి.  
 
విచారణ అనంతరం తిరుపతి సహాయ సెషన్స్ న్యాయస్థానం నలుగురిలో ఒక్కొక్కరికీ నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ 2014లో తీర్పుచెప్పింది. దీంతో వారు జిల్లా కోర్టును ఆశ్రయించారు.
 
ఈ కేసులో నిన్న తీర్పు వెలువడింది. తిరుపతి నాలుగో అదనపు జిల్లా సెషన్సు న్యాయస్థానం ఇన్‌చార్జ్ న్యాయమూర్తి జి.అన్వర్ బాషా వీరిని నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments