Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకాలు తగ్గాలనే మద్యం ధరల పెంపు: ఎమ్మెల్యే రజనీ

Webdunia
బుధవారం, 6 మే 2020 (11:16 IST)
కుట్రలో భాగంగానే తనకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తాను ఇంట్లో కూర్చోలేనని అన్నారు.

తాను నిబంధనలు అతిక్రమించి ఉంటే.. తన నియోజకవర్గంలో కరోనా కేసులు వచ్చిఉండేవన్నారు. తన నియోజకవర్గం పరిధిలో ఒక్క పాజిటీవ్ కేసు కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని రజనీ తెలిపారు.

టీడీపీకి రాజకీయాలు తప్ప ప్రజల బాగోగులు పట్టవని విమర్శలు గుప్పించారు. మద్యం షాపులు తెరిచే నిర్ణయం కేంద్రానిదని స్పష్టం చేశారు. అమ్మకాలు తగ్గాలనే ఉద్దేశంతో సీఎం జగన్ మద్యం ధరలు పెంచారని రజనీ వివరించారు.

మద్యం షాపుల వద్ద గుంపులపై టీడీపీ కుట్ర ఉందని రజనీ ధ్వజమెత్తారు. మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు నిజమేనేమో అనిపిస్తుందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తన పని తాను చేసుకుంటానని ఎమ్మెల్యే రజనీ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments