Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూలై 8వ తేదీన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ : జగన్‌

జూలై 8వ తేదీన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ : జగన్‌
, బుధవారం, 6 మే 2020 (10:47 IST)
జూలై 8వ తేదీన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. జూలై 8వ తేదీలోపు పట్టాల పంపిణీకి సబంధించి మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇంకా లబ్ధిదారులు మిగిలిపోయారని తన దృష్టికి వచ్చిందని, మరో 15 రోజులు సమయం ఇచ్చి, లబ్ధిదారుల తుది జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో పెట్టాలని ఆదేశించారు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబధించి కొందరు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోలేదని, అర్హులైన 
 
వారు దరఖాస్తు చేసుకునేందుకు మరో 15 రోజులు గడువు ఇవ్వాలని అధికారులను సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు.  రేపటి నుంచి 21 వరకు జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు.

అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదనే మాట ఎక్కడా రాకూడదన్నారు. వచ్చే అక్టోబర్‌ నాటికి రైతులకు డెబిట్‌ కార్డులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. రైతులు డబ్బు తీసుకోవచ్చు లేదా కార్డు ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుక్కోవచ్చని తెలిపారు.

రైతులకు క్రెడిట్‌ కార్డు కూడా ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. రైతు భరోసా కేంద్రంలో అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ఇ-క్రాపింగ్‌ చేస్తారని పేర్కొన్నారు. ఇ-క్రాపింగ్‌ ఆధారంగా రైతులకు బ్యాంకులు కచ్చితంగా రుణాలివ్వాలని తెలిపారు.

ఆ రుణంపై వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం వర్తిస్తుందన్నారు. అకాల వర్షాలు రావొచ్చని సమాచారం ఉందని, రైతులు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా ఉగ్రరూపం.. 24 గంటల్లో 1654 కేసులు.. మే నెల 31 వరకు లాక్ డౌన్