Webdunia - Bharat's app for daily news and videos

Install App

60 యేళ్ల తర్వాత తొలిసారి పంచాయతీ పోల్ జరిగిన గ్రామం!

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (12:00 IST)
60 యేళ్ల తర్వాత తొలిసారి పంచాయతీ పోల్ జరుగిన గ్రామం ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 యేళ్లు కావొస్తుంది. కానీ, ఇక్కడ 60 యేళ్ళుగా ఎన్నికలు జరుగలేదు. ఇపుడు ఆ పంచాయతీ ఎన్నిక జరిగింది. 
 
కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి మండలం లక్కసాగరం పంచాయతీ అది. ఇప్పటివరకు ఇక్కడ ఏకగ్రీవంగానే ఎన్నికలు జరిగేవి. కానీ, ఈ దఫా మాత్రం తొలిసారి రెండు వర్గాలు పోటీకి దిగాయి. దీంతో ఎన్నిక అనివార్యమైంది. 
 
లక్కసాగరం పంచాయతీ ఆవిర్భావం నుంచి ఎన్నికలు జరగలేదు. ఈ పంచాయతీ ఎవరికి రిజర్వు అయినా ఇప్పటివరకు గ్రామస్థులందరూ కలిసి ఏకగ్రీవం చేస్తూ వచ్చారు. గ్రామంలో 2,375 మంది ఓటర్లు ఉన్నారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో లక్ష్మీదేవి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఆమె మృతి చెందడంతో ఎన్నిక అనివార్యమైంది. 
 
ఈ నేపథ్యంలో గత సంప్రదాయానికి భిన్నంగా సర్పంచ్ పదవి కోసం రెండు వర్గాలు పోటీ పడ్డాయి. దీంతో ఆదివారం జరిగిన ఎన్నికలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌ రెడ్డి వర్గానికి చెందిన ఎం.వరలక్ష్మి 858 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments