Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో తల్లి ఏకాంతం... కళ్ళారా చూసిన కొడుకు ఏం చేశాడంటే..?

Webdunia
శనివారం, 10 ఆగస్టు 2019 (16:02 IST)
తన తల్లితో అక్రమ సంబంధం జీర్ణించుకోలేని కొడుకు తల్లిని అతి కిరాతకంగా హత్య చేశాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన తీవ్ర చర్చకు దారితీస్తోంది. గుడిపాల మండలం రెట్టగుంట దళితవాడ గ్రామానికి చెందిన డేవిడ్ రాజ్ భార్య జ్యోతి సొంత మరిది సుందర్ రాజు మధ్య గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. జ్యోతి కుమారుడు ప్రేమ్ కుమార్‌కు వీరి విషయం తెలియడంతో తల్లిని పలుమార్లు మందలించినప్పటికీ మార్పు కనిపించలేదు.
 
దీంతో పూటుగా మద్యం సేవించి తల్లి అక్రమ సంబంధాన్ని ప్రశ్నించాడు. దీనిపై తల్లి.. కుమారుడు మధ్య గొడవ జరిగింది. కుమారుడి దౌర్జన్యాన్ని జీర్ణించుకోలేని తల్లి జ్యోతి కుమారుడిపై గుడిపాల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రేమ్ కుమార్‌ను మందలించి పంపారు. తల్లిపై కోపంతో అర్థరాత్రి వేళ ఇల్లు వదిలివెళ్ళిన ప్రేమ్ కుమార్ కొద్దిసేపటి తరువాత ఇంటికి వచ్చాడు.
 
ఇంట్లో తన తల్లి ప్రియుడు సుందరరాజన్‌తో కలిసి ఉండటాన్ని చూపి ఓర్చుకోలేకపోయాడు. ఆవేశానికి గురైన ప్రేమ్ కుమార్ తల్లి జ్యోతిని కత్తితో గొంతు కోసేశాడు. అడ్డొచ్చిన సౌందర్ రాజపై కత్తితో దాడికి దిగాడు. అయితే సౌందర్ రాజన్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. తల్లిన హత్య చేసిన అతడు నేరుగా పోలీస్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments