Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్రగొండపాలెంలో వైకాపా శ్రేణుల ఆందోళన.. చంద్రబాబుకు అదనపు భద్రత

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (18:07 IST)
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాళెంలో వైకాపా శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అదనపు భద్రత కల్పించారు. ఈ జిల్లాలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైకాపా శ్రేణులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు వచ్చే మార్గంలో వైకాపా నేతలు ప్లకార్డులు, నల్లజెండాలతో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. 
 
గతంలో తెదేపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్‌ దళితులను కించపరిచేలా వ్యాఖ్యానించారని, దీనిపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైకాపా కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే ఎర్రగొండ పాలెంలో అడుగుపెట్టనీయబోమని మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. 
 
దీనిని అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. వైకాపా కార్యకర్తల నిరసనలతో ఎన్‌ఎస్‌జీ అప్రమత్తమైంది. చంద్రబాబు భద్రత కోసం అదనపు సిబ్బందిని రప్పించారు. ప్రస్తుతం మార్కాపురంలో పర్యటిస్తున్న చంద్రబాబు..  ఎర్రగొండపాలెంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. అనంతరం ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’ పేరిట నిర్వహించనున్న బహిరంగ సభలో మాట్లాడుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments