Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు బాతులాంటి అమరావతి నిర్వీర్యం : సినీ నటి దివ్యవాణి

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (15:25 IST)
బంగారు బాతులాంటి అమరావతిని వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి, సినీ నటి దివ్యవాణి ఆరోపించింది. పైగా, ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ, బంగారుబాతు వంటి అమరావతిని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. అమరావతిని నాశనం చేయొద్దంటూ అసెంబ్లీలో రెండు చేతులు జోడించి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు వేడుకున్నారని గుర్తుచేశారు.
 
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పంచాయతీ భవనాలకు వేసిన వైకాపా జెండా రంగుల నుంచి రాజధాని వరకు అన్ని నిర్ణయాలను కోర్టులు తప్పుపట్టాయని దివ్యవాణి ఎద్దేవా చేశారు. అమరావతి రైతులకు న్యాయస్థానాలే న్యాయం చేస్తాయని ఆమె తెలిపారు. స్వర్ణప్యాలెస్ దుర్ఘటనలో వాస్తవాలు బహిర్గతం చేయకుండా రమేశ్ బాబుపై కక్షసాధింపులు తగవని దివ్యవాణి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments