పోసాని రియలైజ్ అయ్యేందుకు ప్రభుత్వం ఓ ఛాన్స్ ఇవ్వాలి : నటుడు శివాజీ (Video)

ఠాగూర్
సోమవారం, 17 మార్చి 2025 (19:18 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులను అసభ్యంగా దూషించిన కేసులో అరెస్ట అయి విచారణ ఖైదీగా జైలులో ఉన్న సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి చేసిన తప్పును తెలుసుకుని రియలైజ్ అయ్యేందుకు ఏపీ ప్రభుత్వం ఒక అవకాశం ఇవ్వాలని సినీ నటుడు శివాజీ విజ్ఞప్తి చేశారు. 
 
తాను నటించిన ఓ సినిమా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాల వరకు ఎవరూ వెళ్లరాదన్నారు. ఒక వేళ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని విమర్శించే క్రమంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయా వ్యక్తుల కుటుంబం జోలికి పోరాదన్నారు. తాను 12 యేళ్ల పాటు రాజకీయ జీవితంలో ఉన్నానని, ఏనాడూ కూడా ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని ఆయన గుర్తు చేశారు. 
 
అదే సరైన పద్దతి అని కూడా శివాజీ తెలిపారు. అలాంటపుడు మనం కూడా సేఫ్ ఉంటామని చెప్పారు. ఇక పోసాని విషయంలో జరిగింది చాలని, ఆయన రియలైజ్ అవ్వడానికి ఒక అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా, పోసానికి కోర్టు ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ విధించిన విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments