Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాసుకోండి... చంద్రబాబు ఇచ్చిన డబ్బుల్తో కొన్నానని... శివాజీ చిందులు

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (17:13 IST)
ఆమధ్య శివాజీ తను చేస్తున్న ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమానికి మీడియానే వెన్నుదన్ను అని చెప్పుకుంటూ వుండేవారు. అకస్మాత్తుగా ఏమయింది తెలీదు కానీ ఇటీవలి కాలంలో మీడియా మైకులు ఆయన వద్దకు తీసుకెళ్తుంటే చిందుకు తొక్కుతున్నారు.

తాజాగా ఆయన కృష్ణా జిల్లా గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కనబడ్డారు. గన్నవరంలో రెండు ప్లాట్లు కొనుగోలు చేయగా వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అక్కడికి వెళ్లారు. అంతే... మీడియావారు మైకులు తీసుకుని శివాజీ వద్దకు వెళ్లారు. వారిని చూడగానే శివాజీ చిందులు తొక్కారు. 
 
ఏంటయ్యా... ఏం రాస్తారూ మీరు. మహా అయితే చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో నేను ప్లాట్లు కొన్నాను అని రాస్తారు అంతేగా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాట్లు కొనుగోలు చేసేందుకు వచ్చిన శివాజీ అకస్మాత్తుగా చంద్రబాబు ఇచ్చిన డబ్బు అని ఎందుకు అన్నారో తెలియక అక్కడున్నవారు చూస్తూ నిలబడ్డారు. ఇంతలో శివాజీ మాత్రం మరింత వేగంగా కారెక్కి వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments