Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 వారాల్లో కీలక ప్రకటన వస్తుంది : హాస్య నటుడు అలీ

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (17:24 IST)
మరో రెండు వారాల్లోనే పార్టీ ప్రధాన కార్యాలయం నుంచే కీలక ప్రకటన వస్తుందని ప్రముఖ హాస్య నటుడు అలీ అన్నారు. ఆయన మంగళవారం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆ సమయంలో అలీ భార్య కూడా ఉన్నారు. సీఎంతో సమావేశం ముగిసిన తర్వాత అలీ మీడియాతో మాట్లాడారు.
 
రెండు వారాల్లోనే వైకాపా ఆఫీసు నుంచి కీలక ప్రకటన వస్తుందని చెప్పారు. సీఎంను కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. సీఎం జగన్‌తో భేటీ సందర్భంగా కొంతమంది వైకాపా పెద్దలను కూడా కలవడం జరిగిందన్నారు. కొడాలి నాని, కన్నబాబులతో పాటు పలువురు ఎమ్మెల్యేలను కలిసినట్టు అలీ వివరించారు. 
 
నిజానికి మా పెళ్లి రోజు సందర్భంగా సీఎం జగన్‌ను కలుద్దామని భావించానని కానీ అది సాధ్యపడలేదన్నారు. ఇపుడు కలిసినట్టు చెప్పారు. ఇకపోతే తనకు రాజ్యసభ సీటును ఇస్తున్నారన్న విషయం తనకంటే ముందుగా మీకే తెలుస్తుందని చమత్కరించి, రాజ్యసభ సీటు అంశాన్ని అలీ దాటవేశారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments