Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిఎస్పీనా మజాకా, త్రవ్వేకొద్దీ అక్రమాస్తులు

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (22:13 IST)
ఆయన సాధారణ డిఎస్పీ. రాష్ట్రంలో పలుచోట్ల విధులు నిర్వర్తించాడు. అయితే అక్రమాస్తులు కూడా బాగా కూడబెట్టాడు. తాను పోలీసే కదా తనను ఎవరు పట్టుకుంటారని అనుకున్నాడు. కానీ ఎసిబికి అడ్డంగా దొరికిపోయాడు. 4 కోట్ల రూపాయలకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించి ఎసిబి స్వాధీనం చేసుకుంది.
 
తిరుపతిలోని బైరాగిపట్టడెలో నివాసముండే డిఎస్పీ శంకర్ గత మూడురోజుల క్రితమే కాకినాడ థర్డ్ బెటాలియన్ డిఎస్పీగా బదిలీ అయ్యాడు. అంతకుముందు తిరుపతిలోని ఇంటిలిజెన్స్, లా అండ్ ఆర్డర్ డిఎస్పీగా పనిచేశాడు. అలాగే తిరుపతిలోను పలు పదవుల్లో పనిచేశాడు.
 
ఎస్ఐగా తన కెరీర్‌ను ప్రారంభించి డిఎస్పీ పదవికి వెళ్ళిన శంకర్ కేసులను తారుమారు చేయడం.. ఫిర్యాదుదారులను భయపెట్టడం... ఇలా చాలా రకాల ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎసిబికి ఫిర్యాదు చేశారు బాధితులు. బాధితుల పిర్యాదుతో ఎసిబి రంగంలోకి దిగి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు శంకర్ ఇంట్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు.
 
మొత్తం 4 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను గుర్తించారు. వందల ఎకరాల స్థలాలను రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొనుగోలు చేయడం.. కోళ్ళ ఫారాలను ఏర్పాటు చేయడం.. అలాగే తన చెల్లెలు, బావమరుదలు పేర్లు మీద ఆస్తులు కొనడం గుర్తించిన ఎసిబి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments